Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా శాంతమ్మకు నివాళ్లు
- ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా
- మంత్రులు హజరు
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
పదిరోజుల కిందట అనారోగ్యంతో మరణించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి విరుసనోళ్ల శాంతమ్మ పదిరోజుల కార్యక్రమానికి ఆదివారం సీఎం కేసీఆర్ హాజరై ఆమెకు నివాళి అర్పించారు.మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అమిస్తాపూర్ లోని మంత్రి ఫామ్హౌజ్లో జరిగిన పదిరోజు ల కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు మహమూద్అలీ, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలాకర్ హాజరై శాంతమ్మ ఘాట్వద్దకు చేరుకొని నివాళ్లు అర్పించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఇలాంటి సమయంలోనే మనోధైర్యంతో ఉండాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఓదార్చారు. సరిగ్గా ఎనిమిది నెలల కిందట మంత్రి తండ్రి విరుసనోళ్ల నారాయణగౌడ్ చనిపోవడం బాధకరమన్నారు.కుటుంబ సభ్యుల ను ఆయన ఓదార్చారు. తదుపరి ఫామ్హౌజ్లో భోజనం చేశారు.అనంతరం ఎస్వీఎస్ డిగ్రీకళాశాల దగ్గర ఉన్న హెలీఫ్యాడ్కు చేరుకొని హైదరాబాద్ వెళ్లారు.కార్యక్రమానికి ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,జిల్లా పరిషత్ చైర్మెన్లు, కలెక్టర్ వెంకట్రావు ,ఎస్పీ వెంకటేశ్వర్లు,పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.