Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డెర బంధు ప్రకటించాలి: ఎంవి రమణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్వారీలపై పూర్తి హక్కులు వడ్డెరలకు ఇవ్వాలనీ, వడ్డెర బంధు ప్రకటించాలని తెలంగాణ వడ్డెర వృత్తి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుంచం వెంకట కృష్ణ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి.రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోనిసుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం వడ్డెర్ల వృత్తిదారుల రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్సీ జాబితాలో కొనసాగుతున్న అంశాలను పరిశీలించి, తమ సామాజిక తరగతికి న్యాయం చేస్తామనిఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సామాజిక న్యాయంతో పాటు వడ్డెర్ల సమగ్రాభివృద్ది కావాలన్నారు.దళిత బంధు మాదిరిగానే వడ్డెర బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేస,ి రెండు వేల కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ ఇవ్వాలన్నారు. వడ్డెర సొసైటీలకు ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు పనుల్లో వడ్డెర సొసైటీలకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఏడేండ్ల కాలంలో ఫెడరేషన్కు ఒక్క పైసా కేటాయించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఎంబీసీ సంక్షేమానికి రూ 1000 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని గుర్తుచేశారు. కార్యక్రమంలో చేతి వృత్తిదారుల రాష్ట్ర కో కన్వీనర్ ఫైళ్ల ఆశయ్య, వడ్డెర్ల వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి సాయిలు, రాష్ట్ర నాయకులు పల్లపు విగేష్, డేరంగుల రవికుమార్, గోగుల రాజు, పల్లపు యాదయ్య, పంది కొట్టి ఎల్లయ్య, కుంచెం బిక్షమయ్య, డేరంగుల కృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ డేరంగుల రామకృష్ణ, పల్లపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.