Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదోన్నతులు కల్పించాలి
- ధరణి అమలుకు శక్తి వంచన లేకుండా కృషి : ట్రెసా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రెవెన్యూశాఖలో సమస్యలను పరిష్కరించి బలోపేతం చేయాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్రెడ్డి, కె.గౌతమ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వివిధ క్యాడర్లలో పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని మూసారాంబాగ్ రెవెన్యూ భవన్లో ట్రెసా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ధరణి సమస్యల పరిష్కారం కోసం నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లు పెడుతున్న టార్గెట్లు అందుకోవడానికి రాత్రి పగలు పనిచేస్తూ ఒత్తిడికి లోనవుతున్నామనీ, కనీసం సెలవులను కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నామని చెప్పారు. కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు దక్కట్లేదని వాపోయారు. ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం ధరణిని విజయవంతం చేసి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు వేయి కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ అందించిందన్నారు. ధరణిలో పిఓబి, ల్యాండ్ మేటర్స్ వంటి సమస్యల పరిష్కారంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది రాత్రి పగలు పని చేసి వారు రికార్డులు పరిశీలించి ఇచ్చే నివేదికల ఆధారంగానే కలెక్టర్లు సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. కొత్తగా ఎన్నికైన వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను, ఎన్నికల అధికారులను, ఎన్నికల పరిశీలకులను ట్రెసా రాష్ట్ర కమిటీ శాలువాలతో సన్మానించి అభినందించింది .ఈ కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పూల్ సింగ్, రియాజుద్దీన్, కోశాధికారి వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర కోఆర్డినేటర్ నారాయణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎల్. బి.శాస్త్రి,ఆరేటి రాజేశ్వర్, మంజుల,కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, నిరంజన్ రావు, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి,కె.వెంకట్ రెడ్డి,ఆర్గనైసింగ్ సెక్రటరీలు దేశ్యా, జగన్ మోహన్ రెడ్డి, బన్సీలాల్,విష్ణు సాగర్,సంయుక్త కార్యదర్శులు శైలజ, నాయకులు సతీష్, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.