Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు..
- సీఎం ఆమోదిస్తే.. ప్రయాణీకుల జేబుపై భారం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీచార్జీల పెంపు దాదాపు ఖరా రైంది. తొలుత ముఖ్యమంత్రికి ఈ ప్రతిపాదనలు పంపి, త్వరలో జరగ నున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకొని, పెంచిన చార్జీలను అమల్లోకి తేనున్నారు. చార్జీల పెంపు ప్రతి పాదనల ఖరారుపై ఆదివారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో చార్జీల పెంపు తప్పదని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ప్రతిపాదనలు పంపితే మంత్రివర్గంలో చర్చించి, అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో రవాణామంత్రి సమీక్షా సమావేశానికి ప్రాథాన్యత ఏర్పడింది. గతంలో ఆర్టీసీ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలకు స్వల్పంగా మార్పులు చేసినట్టు సమాచారం. కేంద్రప్రభుత్వం డీజిల్, పెట్రోల్పై పన్నులు తగ్గించిన నేపథ్యంలో ప్రతిపాదనలకు సవరణ చేసినట్టు తెలిసింది. పల్లె వెలుగుకు కిలోమీటర్కు 25పైసలు, ఎక్స్ప్రెస్, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు చొప్పున పెంచాలని ప్రతిపాదించినట్టు సమాచారం. సిటీ ఆర్డినరీ సర్వీసులకు కి.మీ.కు 25పైసలు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఆర్టీసీకి అదనంగా దాదాపు రూ.750 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రయాణీకులపై భారం పడుతుంది. చార్జీల పెంపు వల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)పై ప్రభావం చూపే అవకాశాలూ ఉన్నట్టు తెలుస్తుంది. రెండేండ్ల క్రితం ఆర్టీసీ కార్మికుల 55 రోజుల సమ్మె తర్వాత ప్రభుత్వం భారీగానే చార్జీలను పెంచింది. తాజాగా మరోసారి ప్రయాణీకులపై భారాన్ని మోపేందుకు రంగం సిద్ధమైంది.