Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు కోసం రైతుల పడిగాపులు
నవతెలంగాణ-లింగంపేట్
సకాలంలో తూకం వేయకపోవడం తో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కాపాలాకు రైతు కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. వంతుల వారీగా వచ్చి రేయింబవళ్లు కాపలా ఉంటున్నారు. మహిళలు వచ్చి బీడీలు చుట్టుకుంటుండగా, పిల్లలు వచ్చి అక్క డే ఉంటూ చదువుకుంటున్నారు. పురు షులు రాత్రివేళ అక్కడే పడుకుంటు న్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 343 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదులక్షల మెట్రిక్టన్నుల సేకర ణ లక్ష్యంగాపెట్టుకున్నారు. కానీఇప్పటి వరకు 206 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించి కేవలం 19 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించారు. పై లెక్కలు గమనిస్తేనే కొనుగోళ్లు ఏ మేర జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని రైతులు వాపోతున్నారు. దాంతో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కుప్పల వద్ద రైతులు పడి గాపులు కాస్తున్నారు. లింగంపేట్లోని కొనుగోలు కేంద్రం వద్ద చిన్నారులు ధాన్యం కుప్పలవద్ద చదువుకుంటూకనిపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు, పాలకులు స్పందించి కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.