Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల జోలికొస్తే ఊరుకోను.. కేంద్రంపై తిరగబడతా
- ఉత్తరాది రైతులతో కలిసి పోరాడతాం
- ధాన్యం కొనుగోలుపై కేంద్రానిది పూటకో మాట
- నన్ను అరెస్టు చేసి బతికి బట్టకడతారా
- పెట్రోల్ రేట్లు కొండంత పెంచి...పిసరంత తగ్గిస్తారా?
- వ్యాట్ పెంచం... తగ్గించం
- పెట్రోల్పై కేంద్రం సెస్ రద్దు చేయాలి : బీజేపీపై సీఎం కేసీఆర్ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రైతుల జీవితాలతో చెలగాటమాడే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హెచ్చరించారు. బీజేపీ ఢిల్లీలో ఓ మాట...గల్లీలో ఇంకో మాట చెప్తూ, ప్రజల్ని మోసం చేస్తున్నదని ఘాటుగా విమర్శించారు. ఇకపై కేంద్రం తీరుపై స్తబ్దుగా ఉండబోమని చెప్పారు. ఉత్తరాది రైతుల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రంలో, ఢిల్లీలో టీఆర్ఎస్ తరఫున ధర్నాలు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు కొండంత పెంచి, పిసరంత తగ్గించి, ఇప్పుడు రాష్ట్రాలను దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నించారు. వ్యాట్ను పెంచేదీ, తగ్గించేదీ లేదు. పెట్రోల్, డీజిల్పై కేంద్రప్రభుత్వం విధించిన సెస్ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు నోరు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ను ఆరెస్టు చేసి, నువ్వు రాష్ట్రంలో బతికి బట్టకట్టగలవా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికలో గెలవగానే బీజేపీ నేతలకు నోళ్లు బాగా లేస్తున్నాయనీ, నాగార్జున సాగర్లో వాళ్లకు డిపాజిట్టు కూడా రాలేదన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 2018 ఎన్నికల్లో 107 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లే లేవని చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర అనేక కొర్రీలు పెడుతుందని వివరించారు. దానికి సంబంధించి కేంద్రం రాసిన లేఖల్ని ఆయన విలేకరులకు అందచేశారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందనీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందన్నారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదనీ, ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయని తెలిపారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు.
వ్యవసాయాన్ని స్థిరీకరించాం
యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మంత్రి ఆ మాటులు అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటోందని స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడు రైతుల ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం కకావికలమైన పరిస్థితి ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయాన్ని స్థిరీకరించాం. మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటివి తెచ్చాం. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు పెట్టాం. స్వరాష్ట్రం వచ్చాక మూడు రెట్లు ఎరువుల వినియోగం పెరిగిందని చెప్పారు. రైతులకు ఇప్పుడూ చెప్తున్నాం... యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే మంచి లాభం వస్తుంది. నువ్వులు, పెసర్లతో పాటు రెండు పంటలు పండించుకోవచ్చనీ, వరికంటే దీనికే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పారు.
పెట్రోల్ ధరలు కేంద్రమే తగ్గించాలి
పెట్రోల్,డీజిల్పై కేంద్రం అద్భుతంగా అబద్ధాలు చెబుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్ పెంచిందని చెప్పారు.ఏడేండ్ల్లలో క్రూడాయిల్ ధర ఎప్పుడూ 105 డాలర్లు దాటలేదు. బ్యారెల్ ధర 30డాలర్లు ఉన్నప్పుడు కూడా భారీగా ధర పెంచారు.దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారు.దానితో కొండంత పెంచిన పెట్రో ధరలను పిసరంత తగ్గించారు. బీజేపీ నేతలు అడ్డగోలుగా, ప్రజలను తప్పుతోవ పట్టించే మాటలు మాట్లాడితే చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని విధాలు గా పోరాడుతామన్నారు. పెట్రోల్. డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను నయా పైసా పెంచేదీ, తగ్గించేదీ లేదని స్పష్టం చేశారు. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్ను రద్దు చేయాలి. పెట్రోల్ ధరలు ఎవరైతే పెంచారో వాళ్లే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ పెంపునకు కారణమైన వారినే నిలదీస్తామన్నారు.
అదో భావోద్వేగాల పార్టీ
బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పార్టీ అనీ, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి చర్యలకే పాల్పడుతుందని విమర్శించారు. గడచిన ఏడేండ్లలో దేశానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత జీడీపీ తక్కువగా ఉందన్నారు. ప్రతి బావి వద్ద కరెంటు మీటర్లు పెట్టలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరిస్తున్నారనీ, ఎల్ఐసీ వంటి బ్రహ్మాండమైన సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ వెంటపడతామని అన్నారు. దమ్ముంటే ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్టు బయటపెట్టాలని సవాలు విసిరారు. రైతును ముంచి రాజకీయం చేయాలని చూస్తున్నారనీ, ఈ కుటిల నీతిని రైతులు గమనించాలని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. పాకిస్తాన్, చైనాను చూపి రెచ్చగొట్టడమే బీజేపీ పని అనీ, సరిహద్దులో చైనా ముందు తోకముడిచారనీ. మన దేశ సరిహద్దుల్లో చైనా ఊర్లకు ఊర్లే కడుతుంటే ఏంచేస్తున్నారని అడిగారు. కొవిడ్ సమయంలో గంగానదిలో శవాలు తేలాయని గుర్తుచేశారు. వ్యక్తిగతంగా తనను నిందిస్తే పట్టించుకోలేదనీ, తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడితే మాత్రం తాను చూస్తూ ఊరుకోబోనని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వం రైతులపై భయంకరమైన కుట్ర పన్నుతోందనీ, వారి చేతగానితనంతో దేశాన్ని నాశనం చేశారని విమర్శించారు. కేంద్రం పెంచిన పెట్రోల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. సమావేశంలో మంత్రులు టీ హరీశ్రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎవరి మెడలు వంచుతారు..
''యాసంగి ధాన్యం నాణ్యతగా ఉండట్లేదనీ, తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని కేంద్రం చెబుతోంది. యాసంగిలో రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్డ్ రైస్ కొనలేమని చెప్తోంది. భవిష్యత్లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇవ్వాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అడిగింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక కొర్రీలు పెడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రైతులు వరి పంటనే వేయాలనీ, ప్రభుత్వం మెడలు వంచి వరి పంట కొనుగోలు చేయిస్తాం అని చెబుతున్నారు. ఎవరి మెడలు వంచి కొనుగోలు చేయిస్తారు? కేంద్రం మెడలు వంచుతారా? నా స్థాయి కాదని బండి సంజరుని ఇన్నాళ్లూ వదిలేశా. కానీ, చిల్లర రాజకీయాల కోసం రైతాంగం నష్టపోయేలా చేస్తే, చూస్తూ ఊరుకొనేది లేదు. ఓ వైపు రైతులను కేంద్ర మంత్రి కార్లతో తొక్కిస్తున్నారు. రైతులను కొట్టాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెచ్చగొడుతున్నారు. మేం తమాషా చూడట్లేదు. పరిస్థితులు గమనించట్లేదనుకోవద్దు అని హెచ్చరించారు.
అంత దమ్ముందా...?
''కేసీఆర్ను జైల్లో పెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అంటున్నారు. అంత దమ్ము బీజేపీ నేతలకు ఉందా? కేసీఆర్ని టచ్ చేసి చూడు.. బతికి బట్టకడ తావా? మీరు ధర్నాలు చేయడం కాదు.. రేపట్నుంచి మేం ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నా చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తాం. కేంద్రంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటాం. అవసర మైతే రైతులతో కలిసి ఢిల్లీ వెళ్లి దీక్షలు చేస్తాం. కేంద్రం వరి ధాన్యం కొంటుంటే నేను వద్దన్నానా? వరి కొంటామంటూ కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర నేతలు లేఖ తేవాలి.