Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు టీఎస్జీహెచ్ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చేనెల ఒకటి నుంచి 8 వరకు జరగనున్న సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) నిర్వహణలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణాసంస్థ (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ ఎం రాధారెడ్డిని సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి ఎస్ గిరిధర్ కలిసి వినతిపత్రం సమర్పిం చారు. తక్కువ సమయంలో పేపర్ ప్రింట్ చేయడం సాధ్యమయ్యేలా లేదని వివిధ జిల్లాల్లో డీసీఈబీ సెక్రెటరీలు కోరుతున్నారని తెలిపారు. కనీసం 25 రోజుల నుంచి నెలరోజుల సమయాన్ని పరీక్ష పేపర్లు ప్రింట్ చేసి ఇవ్వడానికి గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారని వివరించారు. పరీక్షల షెడ్యూల్ను సవరించాలని కోరారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న మాదిరిగానే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాదికి 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లనే నిర్వహించాలని సూచించారు.