Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతులకు అండగా సాగు న్యాయనేస్తాలుంటాయని లీగల్ ఎంపర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) అధ్యక్షులు ఎం సునీల్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఊరికో సాగు న్యాయనేస్తాం ఉండాలని పేర్కొన్నారు. చట్టం రైతుకు చుట్టం కావాలని వివరించారు. జాతీయ న్యాయసేవల దినోత్సవం సందర్భంగా లీఫ్స్ సంస్థ సాగు న్యాయనేస్తం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి వెయ్యి మందికిపైగా రైతులకు ఉచిత శిక్షణ, భూమి, సాగు చట్టాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు.