Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 మరణాలను నిర్ధారించే ధవపత్రాలను ఇచ్చేందుకు వీలుగా జిల్లా స్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వీ జీవో నెంబర్ 151ను జారీ చేశారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా ఉండగా జిల్లా వైద్యారోగ్య అధికారి సభ్య కార్యదర్శిగా, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సభ్యునిగా ఉంటారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో కోవిడ్ డెత్ సర్టిఫికేట్ను జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
161 మందికి కరోనా: ఒకరి మరణం
రాష్ట్రంలో కొత్తగా 161మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,844 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 34,510 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 3,334 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 978 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,750 యాక్టివ్ కేసులున్నాయి.