Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ హామీల కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన పూజారుల దేవాలయాలకు ధూపదీపనైవేద్య పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వ హామీల కమిటీ నిర్ణయించింది. శానసమండలి సభ్యులు వి గంగాధర్గౌడ్ అధ్యక్షతన ఈ కమిటీ సోమవారం సమావేశం జరిగింది. విశ్వకర్మల పూజారులకు ధూపదీపనైవేద్య పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి శాసనమండలిలో ఇచ్చిన హామీ లపై సమీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాం లో 8 మంది గిరిజన పూజారులు, 43 మంది విశ్వకర్మలకు ధూపదీప నైవేద్య పథకం అమలైతే, ముఖ్యమంత్రి కేసీఆర్ 58 మంది గిరిజన పూజారులు, 88 మంది విశ్వకర్మలకు ఈ పథకం అమలవుతున్నదని వివరించారు. అర్చకులకు రూ.4 వేలు, ధూపదీపనైవేద్య పథకం అమలుకు రూ.2 వేలు ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు.