Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగురోడ్డు, వరంగల్ జిల్లాలోని ఇతర మున్సిపాల్టీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్-హన్మకొండ జంటనగరాల రవాణా అభివృద్ధికి అవరోధంగా ఉనన రైల్వే ట్రాక్ల మీద రైల్వే ఓవర్ బ్రిడ్జ్రీ (ఆర్వోబీ)ల నిర్మాణం వంటి అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష జరిపి మంజూరు చేస్తారు. వరంగల్ ఇంటర్నల్ రింగురోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, వరంగల్ టెక్స్టైట్ పార్క్ పనుల పురోగతి అంశాలను సమీక్షిస్తారు. హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.