Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఆయన కేసీఆర్ కాదు.. దుబారు శేఖర్' అని సీఎంను ఉద్దేశించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. ధర్నాలు చేసే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంతో చర్చించాలన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో ఉంది? జన్వాడ ఫాంహౌస్ సంగతేంటి? అని ప్రశ్నించారు. కవిత దుబారులో రూ. 60 కోట్లతో ఫ్లాట్ కొన్నమాట వాస్తవం కాదా? అని నిలదీశారు. దళితబంధు అమలు చేసేవరకు కేసీఅర్ను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ను ఏ జైల్లో పెట్టాలో కేటీఆర్ చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో హైదరాబాద్లోని ఆంధ్రులను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. 1200మంది పిల్లల చావుకు కారణమైన కేసీఆర్ సీఎం పదవిని పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో డబ్బులు పని చేయవని హుజూరాబాద్లో స్పష్టమైందన్నారు. మద్యం దుకాణాలను తగ్గించేదాక కేసీఆర్ను వదిలిపెట్టబోమన్నారు.