Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చే విధానాన్ని మానుకోవాలనీ, లేదంటే ఉద్యమం తప్పదని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మద్యం వ్యాపారంతో రాష్ట్ర ఖజానాను నింపుకోవాలన్న తపన తప్పితే..పేద, మధ్యతరగతి కుటుంబాలు మందుకు బానిసలై ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. మద్యం మత్తులో అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు.
మద్యం వల్లనే క్రైం రేటు పెరుగుతున్నదని అనేక నివేదికలు వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్యాన్ని నియంత్రించాలనీ, లేదంటే మహిళా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.