Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజూ తిప్పుకుంటున్న అధికారులు
- ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాత
నవతెలంగాణ-పాలకవీడు
తాము పండించిన పంటను కోసుకోవడానికి.. దాన్ని అమ్ముకోవడానికీ రైతులు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికారులు కొత్తగా నిబంధనలు పెట్టడంతో రోజూ అన్నదాతలు వారి చుట్టూ తిరగాల్సొస్తోంది. టోకెన్ల కోసం సోమవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ధన్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. టోకెన్ల కోసం ఐదురోజులుగా పడిగాపులు కాస్తున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ తిరగాల్సి వస్తోందన్నారు. ఒకేసారి 500 టోకెన్లు ఇవ్వాలని మండల అధికారులు, ఆర్డీఓకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు అనంతప్రకాష్, మోతీలాల్ ఆర్డీఓ, సీఐతో మాట్లాడారు. దాంతో స్పందించిన అధికారులు రేపటి నుంచి ధాన్యం తీసుకొచ్చిన రైతులకు టోకెన్లు రాసి ఇచ్చే పద్ధతిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు.