Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కార్కు హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయనే పిల్ను సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రతివాదు లుగా ఉన్న జీఏడీ ముఖ్య కార్యదర్శి, లా సెక్రెటరీ, టీఎస్పీ ఎస్సీ సభ్యులు రమావత్ ధన్సింగ్, బి లింగారెడ్డి, టి సుమిత్ర ఆనంద్, కె రవీందర్రెడ్డి, డాక్టర్ ఎ చంద్రశేఖర్ రావు, ఆర్ సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది. సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేసిన పిల్ను చీఫ్ జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యావంతులను సభ్యులుగా నియమించాలన్న నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ల నియామకం జరిగిందనీ, ఆ నియామకం కోసం ఇచ్చిన జీవోనెంబర్ 108ను కొట్టేయాలని ప్రొఫెసర్ వినాయక్రెడ్డి వేసిన పిల్పై విచారణ ఈనెల 29కి వాయిదా పడింది.
తీన్మార్ మల్లన్నకు బెయిల్
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు పెట్టిన కేసులో తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్కుమార్)కు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు.
ఆ కంపెనీలో జగన్, విజయసాయిరెడ్డి అక్రమ పెట్టుబడులు
వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉండగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కంపెనీల నుంచి ఆయన కొడుకు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలు అక్రమ పెట్టుబడులకు పెద్ద పీట వేశారని హైకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ చెప్పారు. పెట్టుబడి లేకుండా జగతిలో తనకు చెందిన కంపెనీలైన సండూర్ పవర్, కార్మెల్ ఏసియాలకు నుంచి రూ.73 కోట్లను పెట్టుబడిగా జగన్ పెట్టించారనీ, వాస్తవం చెప్పాలంటే ఆ కంపెనీల్లో ఆ పెట్టుబడులూ జగన్కి చెందినవి కావన్నారు.