Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత బంధును ఎస్సీలందరికీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్ వీపు మోత మోగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ హెచ్చరించారు. 'కేసీఆర్....రాష్ట్రంలో వరి ధాన్యం కొనేందుకు సిద్ధమని కేంద్రం లేఖ ఇచ్చి నెలలు దాటుతున్నా రైతుల నుంచి ధాన్యం ఎందుకు సేకరించట్లేదు?' అని ప్రశ్నించారు. దళిత బంధు పథకం అమలు కోసం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్రామ్ చౌరస్తా నుంచి లిబర్టీ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వరకు డప్పుల మోత ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, తదితరులు పాల్గొన్నారు. సంజరు మాట్లాడుతూ..దళిత బంధును నాలుగో తేదీ నుంచి ఇస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. దళితుణ్ని సీఎం చేసేదాకా కేసీఆర్ను వదిలిపెట్టబోమన్నారు. వ్యాట్ పెంచినట్టు ఆధారాలు చూపిన..పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తవా? లేదా? అని ప్రశ్నించారు. 'టైం చెప్పు...డేట్, ప్లేస్ డిసైడ్ చెరు. తెలంగాణ ప్రజల కోసం తల నరుక్కోవడానికి సిద్ధం. మేం త్యాగాలకు వెనుకాడబోం' అని అన్నారు.