Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం చెల్లిస్తే సరిపోతుందా?
- లాకప్లో తీసిన ప్రాణాలను మళ్లీ తేగలరా?
- మరియమ్మ కేసులో ఏజీపై హైకోర్టు ప్రశ్నల వర్షం
- సీబీఐ ఎస్పీకి నోటీసులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లాకప్లో మరియమ్మ మరణించిన ఘటనకు సంబంధించి హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పీయూసీఎల్ దాఖలు చేసిన పిల్ను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ బుధవారం మరోసారి విచా రించింది. మరియమ్మ మృతిపై విచారణ నివేదికను మేజి స్ట్రేట్ హైకోర్టుకు అందజేశారు. ఆనివేదిక పరిశీలించిన హైకోర్టు ఆమెమృతి కేసు సీబీఐకి అప్పగించదగినదని వ్యాఖ్యానించింది. ఈనెల 22న విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ సీబీఐ ఎస్పీకి నోటీసులు జారీ చేసిం ది. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్కు అప్పగించాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. మరియ మ్మ మృతి ఘటన తర్వాత ప్రభుత్వం అడ్డగూడూరు ఎస్ఐ, కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించినట్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు చెప్పారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం చెల్లించినట్లు, కుమారుడికి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఏజీ చెప్పడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పరిహారంఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రాణాలు తిరిగి వస్తాయా? ఉద్యో గాల నుంచి తొలగించేస్తే సరిపోతుందా? బాధ్యులైనవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా? అని ప్రశ్నలు సంధిం చింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించామని ఏజీ మళ్లీ చెప్పబోతుంటే.. పరిహారమనేది ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇతర అనా రోగ్య సమస్యల వల్ల మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని ఏజీ చెప్పారు. దీనిపై హైకోర్టు ఆమెగుండె ఆగిపోయేలా పోలీసులు కొట్టారా? అనారోగ్య సమస్యలున్న వ్యక్తిని కొట్టాల ని ఎలా అనిపించింది? మరియమ్మ మృతదేహానికి నిర్వహిం చిన పోస్టుమార్టం రెండో రిపోర్టులో మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నాయంటే మరియమ్మను కొట్టారని స్పష్టం అవుతోంది.' ఎంతగా కొట్టారంటే గుండె ఆగిపోయి చచ్చిపో యే వరకూనా? రెండో పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం మరియమ్మ ఒంటిపై గాయాలున్నాయి. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా..మనిషిగా వ్యవహరించాలి కదా?. ప్రాణాలు పోయే విధంగా కొట్టారంటే ఏమనుకోవాలి?.. సీబీఐ లాంటి సంస్థతో దర్యాప్తు చేయాల్సిన కేసు ఇది.. అందుకే పిటిషనర్ సీబీఐని ప్రతివాదిగా చేయాలని ఆదేశిస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అని తీవ్రంగా స్పందించింది. 'అందుకే సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేసి నోటీసులు ఇస్తున్నాం. విచారణకు సీబీఐ ఎస్పీ విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు ఇస్తున్నాం.. ' అని ప్రకటించింది. గవర్నమెంట్ ఇచ్చిన మొదటి పోస్టుమార్టం రిపోర్టులో మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నట్టు లేదని, మేజిస్ట్రేట్ ఇచ్చిన రెండో పోస్ట్మార్టం రిపోర్టులో గాయాలు ఉన్నట్టుగా ఉందని చెప్పింది.