Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిస్టర్ కేసీఆర్..తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశాడనీ, ఆయన తల్లికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి మీ వెన్నంటే ఉన్న చందూలాల్కు, బొంతు రామ్మోహన్, కర్నె ప్రభాకర్, టి.శ్రీనివాస్, తదితర ఉద్యమ నేతలకు కండ్లకు కనిపించట్లేదా? అని నిలదీశారు. ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ అస్సలు జీర్ణించుకోలేడనీ, హుజూరాబాద్ ఓటమితో విపక్షాలపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. నయీం ఆస్తులు విచారణ ఏమైందని ప్రశ్నించారు. వక్ఫ్బోర్డు, అసైన్డ్ భూముల ఆక్రమణలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా? అని నిలదీశారు.