Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘాల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామాల్లో ఏర్పడుతున్న అటవీ హక్కుల కమిటీ ఎంపికలో చైర్మెన్లుగా అధికార పార్టీ సర్పంచుల ఎన్నికను రద్దు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రైతు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాడిసాధించుకున్న పోడుభూముల హక్కులను అధికార పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నదని తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు హక్కులు గుర్తించటానికి గ్రామాల్లో ఎఫ్ఆర్సీలను ఏర్పాటు చేయాలని కోరారు.