Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాలీవుడ్ నటి కంగనారనౌత్ విలాసవంతమైన యాచకురాలు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అవమానిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్య్రం కాదు, భిక్ష అని ఆమె పేర్కొనడంపై నారాయణ గురువారం ఒక ప్రకటనలో స్పందించారు. ఆమెకు పద్మశ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని తెలిపారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంపై మాట్లాడే అర్హత అమెకే కాకుండా కంగనా రనౌత్కు పద్మశ్రీ ఇచ్చిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లకూ లేదంటూ పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటూ ఆమె చెప్పడం బానిస మనస్తత్వానికి నిదర్శనమని తెలిపారు.