Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కష్ణా నదీ యాజమాన్య (కేఆర్ఎంబీ) బోర్డు శుక్రవారం లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలను అందజేయాలని ఆయా రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లను కోరింది. ఔట్లెట్ల నీటి ప్రవాహాలు, గేట్ల నిర్వహణ విధానం వివరాలను తెలియజేయాలని సూచించింది. ఫ్లడ్ హైడ్రోగ్రాఫ్, రిజర్వాయర్ రూటింగ్ స్టడీ వివరాలు, 30 సంవత్సరాల డిమాండ్ వివరాలను ఇవ్వాలని లేఖలో పేర్కొన్నది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల వివరాలు తక్షణం ఇవ్వాలన్న బోర్డు, వీలైనంత త్వరగా సమాచారం అందించాలని కోరింది. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో ఆయా రాష్టాలు ఇప్పటి వరకు వినియోగించుకున్న నీటి లెక్కల వివరాలను సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఉప సంఘం భేటీ హైదరాబాద్ జలసౌధలో జరుగనున్నది. గోదావరిబోర్డు ఉపసంఘం భేటీ లో దేవాదుల, తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంప్హౌస్, చాగలనాడు ఎత్తిపోతలు, కాకతీయ కాల్వ క్రాస్ రెగ్యులేటర్ అంశంపై చర్చ జరుగనున్నది.