Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎట్టకేలకు అధికార టీఆర్ఎస్ పార్టీ, మంత్రులు దిగొచ్చి ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య విజయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలు తమ సమస్యలను చెప్పేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ సమయం కేటాయించాలని కోరారు. ఇప్పటికైనా అధికార పార్టీ కండ్లు తెరిచి ప్రజాస్వామ్య విలువలను గుర్తించడం మంచి పరిణామమని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సీఎం సమయమివ్వాలని సూచించారు. గతంలో మాదిరిగా సచివాలయాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.