Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి రాంబాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలోని సంపన్నుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్నదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ (ఏఐబీఈఏ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి రాంబాబు చెప్పారు. సంపన్నులను మరింత సుసంపన్నం చేసేందుకు బీజేపీ తహతలాడుతున్నదని విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని ఏఐటీయూసీ సత్యనారాయణ భవన్లో జరిగిన ఆయన సమావేశాల్లో ప్రసంగించారు.