Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేద ప్రజల కష్ట సుఖాలలో అనునిత్యం ప్రత్యక్షంగా మమేకమై వారితోనే తన జీవనాన్ని సాగించిన ధర్మభిక్షం గొప్ప మానవతావాది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కొనియాడారు. ఆదివారం హైదరాబాద్లోని మఖ్డూమ్ భవన్లో బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ఉత్సవ సన్నాహక కమిటీ సమావేశం ఆ కమిటీ అధ్యక్షులు చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అఖిల భారత గీత పనివారల కార్మిక సమాఖ్య వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మ బిక్షం విద్యార్ధి దశ నుంచి సమాజమార్పు కోసం స్వతంత్ర పోరాటాలకు విద్యార్ధి సైన్యాన్ని తయారు చేశారని తెలిపారు.