Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాధ పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ రాణిగంజ్లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో గల ఆశ్రిత అనాధ పిల్లల ఆశ్రమంలో బాలల దినోత్సవం జరిగింది. ఆశ్రమం నిర్వాహకులు నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీపీఏ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి సల్లారపు పద్మారెడ్డి, కార్యదర్శి రాచకొండ మల్లేష్ తదితరులు మాట్లాడారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడారు. అనాధ ఆశ్రమాల్లో వుంటున్న పిల్లల సంక్షేమానికి అవసరమై వసతులు, నిధులు ప్రభుత్వం అందించాలని కోరారు. ఆ సందర్భంగా పిల్లలకు మిఠాయిలు, పండ్లు అందజేశారు.