Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాగల 48 గంటల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వైపు మరో తుపాను దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 13న ఏర్పడిన అల్పపీడనంతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఇది తూర్పు మధ్య, ఆగేయ బంగాళాఖాతం మీదుగా రాగల 48 గంటల్లో బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ నెల 18, 20, 21 తేదీల్లో దక్షిణ ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరనుందని వివరించారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు.