Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉచిత చేప పిల్లల పేరుతో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటమే కాక, అవినీతి జరుగుతున్నదని తెలంగాణ కాంగ్రెస్ ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టు సాయికుమారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచితం పేరుతో మత్స్యకారులకు ప్రభుత్వం తీవ్రనష్టం చేస్తున్నదని పేర్కొన్నారు. నీలి విప్లవం అని చెప్పి దళారీలకు మత్స్యశాఖ కొమ్ముకాస్తున్నదని ఆరోపించారు. కొందరి అవినీతి పరుల జేబులు నింపేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మత్స్యశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.