Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది. సోమవారం మానేరు వాగులో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్కు చెందిన నలుగురు విద్యార్థులు సిరిసిల్ల మానేరు వాగులో ఈత కొట్టడానికి వెళ్లారు. వాగులో లోతైన ప్రదేశాలకు వెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన తంగళ్లపల్లి ఎస్ఐ లక్ష్మారెడ్డి.. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక విద్యార్థి మృతదేహం లభ్య మైంది. మృతుడు రాజీవ్నగర్కు చెందిన గణేష్(12)గా తల్లిదండ్రులు గుర్తించారు.