Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ వినరుకుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పిల్లల వికాసానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతోందని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్ వినరుకుమార్ అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం పుస్తకాలయంలో సోమవారం పిల్లల పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ పాఠాలకన్నా పుస్తక పఠనమే మిన్న అని చెప్పారు. బాలల అకాడమీని స్థాపించిన తొలి ప్రధానిగా జవహార్లాల్నెహ్రూ చరిత్రలో నిలిచిపోతారని వివరించారు. డిస్కవరీ అఫ్ ఇండియా, కుమార్తె ఇందిరకు నెహ్రూ రాసిన లేఖలు, గ్రంథాలు రేపటి తరం పిల్లలకెంతో ఉత్తేజాన్ని ఇస్తాయని తెలిపారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు వచ్చి పుస్తక ప్రదర్శనను సందర్శించాలని కోరారు. ఈ నెల30 వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుందనీ, అనేక ప్రచురణాలయాల పుస్తకాలను అందుబాటులో ఉంచామనీ, పిల్లలకు ప్రత్యేక రాయితీ ఉంటుందని తెలిపారు. వివిధ పాఠశాలల బాలబాలికలు పుస్తక ప్రదర్శనను సందర్శించారు. కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు బుచ్చిరెడ్డి, కవి తంగిరాల చక్రవర్తి, డి కృష్ణారెడ్డి, ధనలక్ష్మి, సుభాషిణి, రఘు తదితరులు పాల్గొన్నారు.