Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయా కుటుంబాలను ఆదుకుంటామని హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపైన జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరుల సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.