Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండలో ఐద్వా నిరసన
నవతెలంగాణ-నల్లగొండ
పెరిగిన కూరగాయల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగి పోయాయన్నారు. రూ.500 తీసుకెళ్తే కనీసం నాలుగు రకాల కూరగాయలు కూడా రావడం లేదన్నారు. రోజు వారి పని చేసుకునే కూలీలు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కొండ అనురాధ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కనుకుంట్ల ఉమారాణి, భూతం అరుణకుమారి, బిట్టు రేణుక, అనసూయ, రాధిక, మంగమ్మ, లావణ్య, సుజాత, మౌనిక, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.