Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 నాటికి నివేదిక ఇవ్వాలి : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గడ్డిఅన్నారం మార్కెట్ను బాటసిరంగం ప్రాంతానికి తరలింపు నిర్ణయాన్ని సమర్ధించిన సింగిల్జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలన్న అప్పీల్ను హైకోర్టు మంగళవారం విచారణ చేసింది. బాటసింగారంలో వసతుల కల్పన చేస్తామని ప్రభుత్వం చెప్పింది. వసతులు లేవని హౌల్సేల్ పండ్ల వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల లాయర్ చెప్పారు. వాస్తవాలు తెలుసుకునేందుకు అడ్వకేట్ కమిషన్ను నియమిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డితో కూడిన బెంచ్ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 19 నాటికి అడ్వొకేట్ కమిషన్ నివేదిక ఇవ్వాలని, అప్పటి వరకూ గడ్డిఅన్నారంలోనే మార్కెట్ కొనసాగింపునకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.