Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 167 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,283 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 32,177 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,106 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 952 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,737 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 55 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా తొమ్మిది జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
16 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం జీహెచ్ఎంసీతో సహా16 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
తొమ్మిది జిల్లాల్లో తగ్గిన కేసులు
జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, నిజామాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
ఆ జిల్లాల్లో జీరో....
ములుగు జిల్లాలో ఐదు రోజులుగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాలుగు రోజులుగా, నారాయణపేట జిల్లాలో మూడు రెండు రోజులుగా, జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. జనగామ, కొమురంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో రెండు రోజులుగా కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.