Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ప్రజాసంఘాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించటం అన్యాయమని విరసం నేత పాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి ప్రజా సంఘాల కార్యకర్తల ఇండ్లపై సోదాలు నిర్వహించి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు, హార్డ్ డిస్కులు, పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రెస్ వాళ్లను కూడా అనుమతించకుండా, వందలాది మంది పోలీసులను పహారాగా ఉంచి, పరిసరాల ప్రజలను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. దశాబ్దాలుగా సమాజంలో వివిధ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయా ప్రజాసంఘాల నాయకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బహిరంగంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.