Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ
నవతెలంగాణ - మహబూబ్నగర్
దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ ఐక్య పోరాటాలు చేస్తామని, అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కేవీపీఎస్ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రైతుల అలుపెరగని పోరాటాల ఫలితమే వ్యవసాయ చట్టాల రద్దు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులు విజయం సాధించారని చెప్పారు. కార్మిక చట్టాలు, నూతన విద్యా విధానం వెనక్కి తీసుకునే వరకు ఇదే స్ఫూర్తితో కార్మికులు, విద్యార్థులు, యువకులు ఐక్య పోరాటాలు చేయాలన్నారు. దళితులకు రావాల్సిన రూ.3 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల లబ్ది కోసమే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎ.రాములు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరశురాములు, మీసాల కురుమయ్య, దీప్లానాయక్, మాణిక్యం రాజు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.