Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైసీపీకి జగ్గారెడ్డి సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చంద్రబాబు సతీమణి విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుగా మాట్లాడారని కాంగ్రెఎస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు తగవనీ, వాటిని ఆపాలని కోరారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర పోషించారని గుర్తు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా మాట్లాడిన విధానం సరైందికాదని చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్ కలగజేసుకుని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.