Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసం వత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 22న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. 22, 23 తేదీల్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. అదేనెల 26న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు https://tsicet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.