Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్, ముంబయి, కోల్కతాల్లో సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం ఎల్బీనగర్లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో ''దేశంలో సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచీల అవసరం'' అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ఒక్క ఎస్టీ జడ్జీ కూడా లేరని గుర్తు చేశారు. దేశంలోని హైకోర్టుల్లో 44 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయనీ, సుప్రీంకోర్టులో 59,211 కేసులు, దేశ వ్యాప్తంగా జిల్లా, సబార్డినెట్ కోర్టుల్లో 3 కోట్ల 10 లక్షల 72 వేల కేసుల పరిస్థితి అదేనని చెప్పారు. దేశ జనాభాకు అనుగుణంగా జడ్జీల సంఖ్య లేదన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మెన్ తమిళనాడు రాష్ట్ర మాజీ ఎంపీ ఖరువెంతన్, తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్చైర్మెన్ సునీల్ గౌడ్, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి కళ్యాణ్, ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, హెడ్ వెంకటేశ్వర్లు, మహాత్మా గాంధీ లా కాలేజ్ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.