Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా బులెటిన్ కోవిడ్-19 వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 103 మందికి కరోనా సోకింది. ఖమ్మం జిల్లాలో మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవి శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 22,902 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ అధికారికంగా వెల్లడించిన గణాంకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో 19,238 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 3,664 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 596 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,575 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 49 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో 13 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
ఏడు జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శనివారంతో పోలిస్తే ఆదివారం జీహెచ్ ఎంసీతో సహా ఏడు జిల్లాల్లో కేసులు పెరిగా యి. జనగామ, కరీంనగర్, మహబూ బాబాద్, నారాయణపేట, వికారాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
23 జిల్లాల్లో తగ్గిన కేసులు
భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.