Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన
- 24న సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఎడ్ రెండేండ్ల కోర్సులో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎడ్సెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్బాబు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎడ్సెట్ ప్రవేశాల నోటిఫికేషన్ ఈనెల 29న విడుదల చేస్తామని తెలిపారు. వచ్చేనెల ఒకటి నుంచి ఎనిమిది వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందనీ, స్కాన్ చేసిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు (ఎన్సీసీ, క్యాప్, వికలాంగులు, క్రీడల విభాగం) వచ్చేనెల 9 నుంచి 14 వరకు భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. 17న రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. 18 నుంచి 20 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. 21న వెబ్ఆప్షన్లు మార్పుచేర్పులకు అవకాశముందని పేర్కొన్నారు. 24న సీట్లు కేటాయిస్తామని వివరించారు. 24 నుంచి 28 వరకు సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనతోపాటు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలనీ, ట్యూషన్ ఫీజు చలానా ఇవ్వాలని కోరారు. 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఎడ్సెట్కు 42,399 మంది దరఖాస్తు చేయగా, 34,185 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరయ్యారు. వారిలో 33,683 (98.53 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.