Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల కసరత్తు వేగవంతం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఈనెల 30న విడుదలయ్యే అవకాశమున్నది. ఈ దిశగా ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. గతనెల 25 నుంచి ఈనెల 3 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరిగింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,09,897 మంది రెగ్యులర్, 49,331 మంది ఒకేషనల్ కలిపి మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనివార్య కారణాలతో ఈనెల 30న సాధ్యం కాకపోతే వచ్చేనెల ఒకటి లేదా రెండున ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు 2022, మార్చి 23 నుంచి జరిగే వార్షిక పరీక్షలతోపాటే ఆ సబ్జెక్టులను రాయాల్సి ఉంటుంది.