Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 147 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 33,836 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 29,011 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,825 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,460 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,531 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 56 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా తొమ్మిది జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో ఏడు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
11 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో బుధవారంతో పోలిస్తే గురువారం జీహెచ్ఎంసీతో సహా 11 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
12 జిల్లాల్లో తగ్గిన కేసులు
జగిత్యాల, జనగామ, మహబూబాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్ యాదాద్రి భువనగిరి జిల్లాల కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.