Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాచార శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జె పవన్కుమార్ మృతి పట్ల ఆ శాఖ అధికారులు,ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. బుధవారం రాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మాసబ్ట్యాంక్లోని ఆ శాఖ కార్యాలయంలో సంతాప కార్యక్ర మం జరిగింది.ఆయన చిత్రపటానికి అధికారులు,ఉద్యోగులు పూలమాల లువేసి నివాళులర్పించారు.శాఖలో పనిచేసిన సందర్భంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.మరణానికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ఎల్ఆర్ కిషోర్బాబు,మీడియాఅకాడమి సెక్రెటరీ వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్లు డిఎస్ జగన్,డి శ్రీనివా స్,ఇంఛార్జీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ రాధాకిషన్, తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ ఎ రాంమోహన్రావు,డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్,పాండురంగరావు, ప్రసాదరావుతోపాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.