Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రం వద్ద..
నవతెలంగాణ-సదాశివనగర్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు ఎండబెడుతున్న సమయంలో రైతుకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య (48) తన వరి ధాన్యాన్ని అమ్మేందుకు అడ్లూర్ ఎల్లారెడ్డి విండో ఆధ్వర్యంలో బీసీ కాలనీ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. అక్కడే గురువారం రాత్రి వడ్లకుప్ప వద్ద పనులు చేస్తున్న సమయంలో గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజయ్యను రామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా రాజయ్యకు భార్య రాజవ్వ, కుమారుడు, కూతురు ఉన్నారు.