Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రామగుండంలో ఆదివారం జరుగనున్న సేఫ్టీ కమిటీ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు వారికి చెల్లించాల్సిన రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్లు, ఆపరేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అధికారులకు ఆయన శనివారం లేఖ రాశారు. ఈ సమావేశంలో యాజమాన్యానికి డైరెక్షన్ ఇవ్వాలని సౌత్ సెంట్రల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సేఫ్టీ మైన్స్ను కోరారు.