Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 మందితో నూతన కమిటీ
- 8 మందితో కార్యదర్శివర్గం
- ముగిసిన మహాసభ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులుగా జరిగిన సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 22వ మహాసభ ఆదివారం ముగిసింది. మహాసభలో 19 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. 8మందితో కార్యదర్శివర్గం, నూతన కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కమిటీలోకి కొత్తగా ఐదుగురిని తీసుకున్నారు. కార్యదర్శివర్గ సభ్యులుగా ఎం.శ్రీనివాస్రావు, ఎం.దశరథ్, ఎం.వెంకటేష్, కె.నాగలక్ష్మి, కేఎన్.రాజన్న, ఎం.మహేందర్, కె.ఈశ్వర్రావు ఎన్నికయ్యారు. జిల్లాకమిటీ సభ్యులుగా ఎం.అజరుబాబు, సి.మల్లేష్, జి.నరేష్, ఎన్.మారన్న, ఆర్.వెంకటేష్, జె.కుమారస్వామి, ఎ.పద్మ, ఆర్.వాణి, వహీద్, జి.కిరణ్, ఆర్.అశోక్ ఎన్నికయ్యారు. ఈ మహాసభలో పలు తీర్మానాలు చేశారు. 'పూర్తయిన డబుల్బెడ్రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలనీ, రాష్ట్రప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలు, గ్రాంట్స్ వెంటనే చెల్లించాలనీ, ప్రత్యేక నిధులు కేటాయించి నగర సమగ్రాభివృద్ధికి కృషిచేయాలి, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలనీ. కనీసవేతనాల జీఓలను సవరించడంతోపాటు కనీసవేతనం రూ.21వేలుగా నిర్ణయించి అమలు చేయాలి' అనే నాలుగు తీర్మానాలను మహాసభ ఆమోదించింది.