Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విదేశాలకు ధాన్యం ఎగుమతులు పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తద్వారా రైతులకు ప్రయోజనం జరుగుతున్నదని చెప్పారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. భారత దేశానికి, వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. దేశంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడ్డారని గుర్తుచేశారు. గోదాములో ధాన్యం నిల్వలు ఉంటే ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.