Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏఎన్ఎంలందరికీ తొలి పీఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్యూ) డిమాండ్ చేసింది. హైదరాబాద్లో సోమవారం ఆ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీసర్ బేరర్ల సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్లో పని చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న ఏఎన్ఎంలు,ఈసి ఏఎన్ఎంలకు, హెచ్ఆర్డీ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలనీ డిమాండ్ చేశారు.