Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవం కావడానికి కషిచేసిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ వినరుభాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కూడా కేటీఆర్ అభినందించారు.