Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 మందితో పార్టీ జిల్లా కమిటీ
- 11 మందితో కార్యదర్శివర్గం
- కొత్తగా ముగ్గురికి చోటు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శిగా నున్నా నాగేశ్వరరావు మరోమారు ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా కేంద్రం ఎంబీ గార్డెన్స్లోని వేదగిరి శ్రీనివాసరావు నగర్లో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభలు మంగళవారం ముగిశాయి. ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ మహాసభకు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, పోతినేని సుదర్శన్రావు, ఎం. సాయిబాబు పర్యవేక్షకులుగా పాల్గొన్నారు. మంగళవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కమిటీకి ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కార్యదర్శివర్గ సభ్యులుగా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో పాటు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, కల్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, భూక్యా వీరభద్రం, చింతలచెర్వు కోటేశ్వరరావు, బొంతు రాంబాబు, వై.విక్రమ్లను ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా.. కార్యదర్శివర్గంలోని 11 మందితో పాటు మరో 34 మందిని కలిపి మొత్తం 45 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.